ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(Allu Arjun)అట్లీ(Atlee)కాంబోలో తెరకెక్కబోతున్నక్రేజీ ప్రాజెక్ట్ పై,ఇటీవల అల్లుఅర్జున్ బర్త్ డే సందర్భంగా అధికార ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.పైగా మేకర్స్ తమ చిత్రం ఎలా ఉండబోతుందో ఒక వీడియో కూడా రిలీజ్ చేసారు.ఆ వీడియో చూస్తే అంతర్జాతీయప్రమాణాలతో,అంతర్జాతీయ టెక్నీషియన్స్ తో తెరకెక్కబోతుందనే విషయం అర్ధమవుతుంది.దీన్నిబట్టి కథ కూడా అంతే స్థాయిలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.
.
ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే నటీనటుల ఎంపిక ఉండబోతుంది.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సరసన ప్రియాంకచోప్రా(Priyanka Chopra)జోడి కట్టబోతుందనే ప్రచారం జరుగుతుంది.ప్రియాంక బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా నటిస్తు తన సత్తా చాటుతుంది.దీంతో ప్రియాంకని తమ చిత్రంలోకి తీసుకుంటే మూవీకి హెల్ప్ అవుతుందని టీం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే మేకర్స్ ప్రియాంకని సంప్రదించబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.ప్రియాంక ఇప్పటికే మహేష్(Mahesh Babu)రాజమౌళి(Rajamouli)సినిమాలో చేస్తుంది.ఈ చిత్రం కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది.అందుకే ప్రియాంకని రాజమౌళి టీం ఎంపిక చేసింది.
వరల్డ్ సినీ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని అల్లుఅర్జున్,అట్లీ చిత్రం తెరకెక్కుతుండగా,సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తుంది.ఈ ఏడాది చివర్లో మూవీ ప్రారంభం కాబోతుంది.పుష్ప2 లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత అల్లుఅర్జున్ చేస్తున్న ఈ మూవీపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.షారుక్ తో జవాన్ చేసిన రెండేళ్ల తర్వాత అట్లీ ఈ మూవీ చేస్తున్నాడు.