posted on Apr 15, 2025 4:09PM
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు. 7.5 కోట్ల రూపాయల విలువైన గుర్గావ్ ల్యాండ్ స్కామ్ వ్యవహారంలో రాబర్ట్ వాద్రాకు ఈడీ నోటీసులు జారీ చేసింది. తొలుత జారీ చేసిన నోటీసుల ప్రకారం ఈ నెల 8న విచారణకు హాజరుకావాల్సి ఉండగా వాద్రా గైర్హాజరయ్యారు.
దీంతో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసి ఈ రోజు హాజరు కావాలని పేర్కొంది. దీంతో రాబర్ట్ వాద్రా మంగళవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. బీజేపీ రాజకీయ ప్రతికారంలో భాగంగానే తనకు ఈడీ నోటీసులు జారీ చేసిందని ఆ సందర్భంగా రాబర్ట్ వాద్రా ఆరోపించారు. తాను ప్రజల తరఫున గళమెత్తిన ప్రతి సందర్భంలోనూ బబీపీ అణచివేయడానికి ప్రయత్నిస్తోందని వాద్రా అన్నారు. అన్నారు.