ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై.. బీజేపీ తమిళ రాజకీయం | bjp tamil politics| annamalai| mp| from| andhrapradesh| tdp| janasena

posted on Apr 23, 2025 2:24PM

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి కేటాయించబోయే రాజ్యసభ స్థానం నుంచి.. పార్లమెంటులో అడుగుపెట్టబోయే అదృష్టవంతుడెవరో దాదాపుగా తేలిపోయిందంటున్నారు. వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి రాజీనా మాతో ఖాళీ అయిన ఎంపీ సీటుని.. బీజేపీకి వదిలేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారన్న ప్రచా రం జరుగుతోంది. దాంతో ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తరుణంలో అనూహ్యంగా తమిళనాడు బీజేపీ నేత అన్నామలై పేరు తెరమీదకు వచ్చింది. దీంతో మొత్తం లెక్కే మారిపోయిందంటున్నారు.

తాజాగా ఏపీలో మరో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే.. మోపిదేవి వెంకటరమణ, బీదమస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య వైసీపీతో పాటు తమ రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దాంతో.. ఖాళీ అయిన 3 స్థానాల్లో టీడీపీ నుంచి బీద మస్తాన్ రావుకు మళ్లీ చాన్స్ ఇచ్చారు. మోపిదేవి స్థానాన్ని సానా సతీశ్‌తో భర్తీ చేయగా, ఆర్.కృష్ణయ్యను బీజేపీ తరఫున రాజ్యసభకు పంపారు. ఇప్పుడు.. విజయసాయిరెడ్డి రాజీనామాతో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే.. ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించారన్న ప్రచారంతో.. ఏపీ నుంచి ఎవరిని రాజ్యసభకు ఎంపిక చేస్తారనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది.

ఇటు ఏపీ బీజేపీలోనూ రాజ్యసభ స్థానానికి ఎంపికయ్యే అదృష్టవంతుడు ఎవరనే దానిపై హాట్ డిబేట్ మొదలైంది. రాజ్యసభలో అడుగుపెట్టేందుకు.. ఏపీ బీజేపీ నేతలు పలువురు తహతహలాడుతున్నారట. ముఖ్యంగా.. మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌తో పాటు రాజ్యసభ మాజీ  ఎంపీ జీవీఎల్ నరసింహరావు లాంటి వారితో పాటు కొందరి పేర్లు వినపడుతున్నాయ్. కానీ.. అధిష్టానం ఆలోచన మాత్రం మరోలా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయ్. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాన్ని.. ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలకు అవకాశం ఇవ్వాలని కాషాయ పెద్దలు భావిస్తున్నారంట.

త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందనే సంకేతాలను దృష్టిలో పెట్టుకొని.. ఈ రాజ్యసభ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేస్తారనే చర్చ నడుస్తోంది. కేంద్ర కేబినెట్‌లో చేరే ఇతర రాష్ట్రాల నాయకులను ఏపీ నుంచి రాజ్యసభకు పంపే అవకాశాలున్నాయని ఢిల్లీ నుంచి సిగ్నల్స్ అందుతు న్నాయట. 2014-19 మధ్యలో.. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఉన్నప్పుడు.. కేంద్రమంత్రి సురేశ్ ప్రభుకు ఏపీ నుంచి చాన్స్ ఇచ్చారు. ఇప్పుడు,  తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు బలంగా వినిపిస్తోంది. 

వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. అన్నామలైని ఏపీ నుంచి రాజ్యసభకు పంపే చాన్స్ ఉందట. అన్నామలైని పెద్దల సభకు పంపి.. కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటే, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- అన్నాడీఎంకే కూటమి బలం పెరుగు తుందనేది బీజేపీ నేతల అంచనా. అధ్యక్ష పదవి పూర్తయ్యాక అన్నామలైకి ఎంపీగా అవకాశం ఇస్తామని అధిష్టానం హామీ కూడా ఇచ్చిందంట.  2024 లోక్‌సభ ఎన్నికల్లో, నారా లోకేశ్ కూడా కోయంబత్తూరులో అన్నామలై తరఫున ప్రచారం చేశారు. ఆ క్రమంలో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో.. ఆంధ్రా నుంచి అన్నామలై రాజ్యసభకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటు న్నారు. 

మరోవైపు, బీజేపీలో సీనియర్ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు కూడా వినిపి స్తోందనే ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో ఆమె.. అమేథీలో రాహుల్ గాంధీపై పోటీ చేసి ఓడి పోయారు. స్మృతీ ఇరానీ లాంటి మహిళా నేతలను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటే.. పార్లమెంట్‌లో బీజేపీకి బలమైన వాయిస్ ఉంటుందనే ఆలోచన కూడా అధిష్టానం చేస్తోందట. దాంతో.. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు.. ఏపీ నుంచి రాజ్యసభ ఎంపీగా వెళతారని.. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.



Source link