posted on Apr 10, 2025 7:19AM
కేంద్ర మంత్రి మనవరాలు దారుణ హత్యకు గురైంది. ఈ దారుణం బీహార్ లో జరిగింది. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మ తన భర్త చేతిలోనే దారుణ హత్యకు గురైంది. భార్యా భర్తల మధ్య చోటు చేసుకున్న వివాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు.
సుష్మను కాల్చి చంపిన ఆమె భర్త రమేష్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. గత కొంత కాలంగా భార్యా భర్తల మధ్య తగాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రమేష్ సింగ్ తన భార్య సుష్మను బంధించి ఆమె ఛాతి భాగంలో తుపాకీతో కాల్చి హత్య చేశాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.