posted on Jun 12, 2025 9:46PM
జిల్లాల ఇన్ఛార్జి మంత్రులను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా గడ్డం వివేక్ వెంకటస్వామి, నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రిగా వాకిటి శ్రీహరి, ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జిగా జూపల్లి కృష్ణారావు, నిజామాబాద్ ఇన్చార్జిగా సీతక్క, కరీంనగర్ జిల్లా ఇన్చార్జిగా తుమ్మల నాగేశ్వర రావు, మహబూబ్ నగర్ ఇన్చార్జిగా దామోదర్ రాజనర్సింహా, రంగారెడ్డి ఇన్చార్జిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇన్చార్జిగా పొన్నం ప్రభాకర్, వరంగల్ జిల్లా ఇన్చార్జిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. సీఎం రేవంత్ రెడ్డికి కొత్త సీపీఆర్ఓ గా గుర్రం మల్సూర్ను ప్రభుత్వం నియమించింది.