పీఎస్సార్ ఆంజనేయులుకు మే 7వరకూ రిమాండ్ | court remand psr anjaneyulu remand| ap| inteligence| former| chief| may7th| kadambari| jetwani

posted on Apr 23, 2025 12:25PM

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును ఏపీ సీఐడీ   బేగంపేటలోని ఆయన నివాసంలో  అరెస్టు చేసి విజయవాడకు తరలించిన సంగతి తెలిసిందే.   ప్రస్తుతం సస్సెన్షన్ లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు జగన్‌ హయాంలో  ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పని చేశారు. ఆ సమయంలో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పై పెట్టిన కేసు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేయడానికి   ముంబైకు చెందిన నటి కాదంబరి జత్వానీపై కేసు బనాయించి, అక్రమంగా ముంబై నుంచి విజయవాడకు తీసుకు వచ్చి నిర్బంధించారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ మేరకు నటి జత్వానీ అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, అప్పుడు విజయవాడ సీపీగా ఉన్న కాంతిరాణాతాతా, డీసీపీగా ఉన్న విశాల్ గున్నీపై చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.   ఇప్పుడు ఆ కేసులోనే పీఎస్సార్ ఆంజనేయులును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడ సీఐడీ కార్యాలయంలో పీఎస్సార్ ఆంజనేయులును దాదాపు ఏడుగంటల పాటు విచారించిన అనంతరం ఆయనకు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు మే 7 వరకూ రిమాండ్ విధించింది. 



Source link