ప్రభాస్ ‘ఫౌజి’కి షాకింగ్ బడ్జెట్.. పుష్ప రెండు పార్టులు కలిపినా అంత లేదు!

 

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. వాటిలో మారుతి దర్శకత్వంలో చేస్తున్న ‘ది రాజా సాబ్’, హను రాఘవపూడి డైరెక్షన్ లో చేస్తున్న ‘ఫౌజి’ షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ‘ఫౌజి’ బడ్జెట్ కి సంబంధించిన న్యూస్ ఒకటి టాలీవుడ్ ని షేక్ చేస్తోంది. 

 

ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘ఫౌజి’ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.600 కోట్ల‌ని టాక్. ఇప్పటిదాకా మైత్రి బ్యానర్ లో ఇదే అత్యధిక బడ్జెట్ కావడం విశేషం. రెండు భాగాలుగా వచ్చిన ‘పుష్ప’కి సైతం ఇంత ఖర్చు పెట్టలేదని తెలుస్తోంది. రెండు భాగాలకు కలిపి రూ.500 కోట్ల లోపే బడ్జెట్ అయిందని సమాచారం. అలాంటిది ఇప్పుడు ఒకటే మూవీగా తెరకెక్కుతోన్న ‘ఫౌజి’ కోసం ఏకంగా రూ.600 కోట్లు ఖర్చు పెడుతున్నారనే వార్త సంచలనంగా మారింది. ప్రభాస్ స్టార్డంకి తగ్గ సరైన కథను హను సిద్ధం చేశాడని, అందుకే మైత్రి మేకర్స్ ఏమాత్రం వెనకాడకుండా ఖర్చు చేస్తున్నారని అంటున్నారు.

 

హను కథని నమ్మి మైత్రి ఎలాగైతే రూ.600 కోట్ల బడ్జెట్ పెడుతుందో, అలాగే హను ప్రతిభను నమ్మి ఆయన డైరెక్షన్ లో మరో సినిమా చేయడానికి ప్రభాస్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి హనుకి అడ్వాన్స్ కూడా ఇప్పించినట్లు వినికిడి. మొత్తానికి ‘ఫౌజి’తో హను సంచలనం సృష్టించేలా ఉన్నాడు.

 



Source link