posted on Apr 9, 2025 4:18PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఐపిఎస్ అధికారి ప్రభాకర్ రావుకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. అతని పాస్ పోర్టును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారి చేసింది. ఇప్పటికే ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారి అయ్యాయి. ఈ విషయాన్ని సిట్ అధికారులకు సిబిఐ సమాచారమిచ్చింది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ప్రభాకర్ రావు చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లి అక్కడే మకాంవేశారు. బిఆర్ ఎస్ ప్రభుత్వం హాయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వల్ల కేసీఆర్ ప్రభుత్వం అపఖ్యాతిని మూట గట్టుకుంది.