సింగపూర్లో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. విషయం తెలిసినప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాలు ముగించుకొని మంగళవారం రాత్రి సింగపూర్ బయల్దేరారు పవన్. అలాగే చిరంజీవి కూడా సతీ సమేతంగా వెళ్లారు. మార్క్ శంకర్ కాళ్ళకు, కాళ్ళకు గాయాలయ్యాయి. ఈరోజు ఉదయం వరకు అత్యవసర చికిత్స అందించిన డాక్టర్లు అతన్ని రూమ్కి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం శంకర్ కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఊపిరి తిత్తుల్లోకి పొగ చేరుకోవడంతో చాలా ఇబ్బంది పడ్డాడని, దీని వల్ల భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు రాకుండా చికిత్స చేసేందుకు మరో మూడు రోజులపాటు శంకర్ ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.
చికిత్సలో భాగంగానే మార్క్ శంకర్కు మరిన్ని వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని.. అలాగే వైద్యుల పర్యవేక్షణ అవసరమని డాక్టర్లు పవన్ కళ్యాణ్ కుటుంబానికి తెలియజేశారని తెలుస్తోంది. శంకర్ని రూమ్కి తరలించిన తర్వాత ఒక ఫోటో బయటికి వచ్చింది. రెండు చేతులతో తాను ఓకే అని అర్థం వచ్చేలా డన్ అని చూపిస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సింగపూర్లో అగ్ని ప్రమాదం గురించి మంగళవారం ఉదయమే తెలిసినా షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలొని విశాఖపట్నం పర్యటనను మాత్రం రద్దు చేసుకొని సాయంత్రానికి హైదరాబాద్ చేరుకున్నారు పవన్. మంగళవారం రాత్రి ప్రత్యేక విమానంలో సింగపూర్ బయల్దేరారు.