posted on Apr 22, 2025 3:17PM
ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ బాబాపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. షర్బత్ జిహాద్ అంటూ రాందేవ్ బాబా చేసిన కామెంట్స్పై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రామ్దేవ్ బాబాకు చెందిన పతంజలి ఫుడ్స్ లిమిటెడ్కు వ్యతిరేకంగా హమ్దార్ద్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ నెల ప్రారంభంలో బాబా రాందేవ్ పతంజలి గులాబీ షర్బత్ను ప్రారంభించినప్పుడు రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. “మీకు షర్బత్ ఇచ్చే కంపెనీ సంపాదించే డబ్బును మదర్సాలు, మసీదులను నిర్మించడానికి ఉపయోగిస్తారు. కానీ మీరు దీన్ని తాగితే (పతంజలి గులాబీ షర్బత్ను ఉద్దేశిస్తూ) గురుకులాలు నిర్మిస్తాం. ఆచార్య కులం అభివృద్ధి చెందుతుంది.
పతంజలి విశ్వవిద్యాలయం విస్తరిస్తుంది. భారతీయ శిక్షా బోర్డు పెరుగుతుంది” అని అన్నారు. కాగా.. బాబా రాందేవ్ హమ్దర్ద్ పేరుని ప్రస్తావించనప్పటికీ దాన్ని ఉద్దేశించే పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. దీనిపైనే హమ్ దర్డ్ కంపెనీ ఢిల్లీ కోర్టుని ఆశ్రయించింది. కాగా..రాందేవ్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే సోషల్ మీడియా నుంచి ఆ వీడియోను తొలగించేలా ఆదేశించాలని తెలిపింది. హమ్దర్ద్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇది ఆ సంస్థ ఉత్పత్తిని అగౌరవపరచడం కంటే తీవ్రమైందని, అవి ద్వేషపూరిత వ్యాఖ్యల కిందికే వస్తాయని వాదించారు. దీనిపై స్పందించిన కోర్టు… “బాబా రామ్దేవ్ వ్యాఖ్యలు కోర్టు అంతరాత్మను షాక్కు గురి చేశాయి. ఇలాంటి వ్యాఖ్యలు ఎంతమాత్రం కరెక్ట్ కాదు అని పేర్కొన్నాది.